మల్హర్, సెప్టెంబర్ 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రం తాడిచర్లలో ఆదివారం పాముకాటుతో రైతు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం… తాడిచర్లకు చెందిన కందుల మల్లయ్య (52) రోజువారీగా శనివారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు.
వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు భూపాలపల్లి జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు. అనంతరం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా పరిస్థితి విషమించి మల్లయ్య మృతి చెందాడు. మల్లయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.