హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య చికిత్సలకు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు తన మద్ద తు ఉంటుందని, వాటిల్లో పా లుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. ప్రగతిభవన్లో బుధవారం ఆయ న మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. దశాబ్దాలపాటు లక్షల మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించిన దత్తాత్రేయను కలవడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఇరువురు క్యాన్సర్ చికిత్సా విధానాల్లో వివిధ దేశాలు అనుసరిస్తున్న పద్ధతుల గురించి చర్చించారు. కరోనా సం క్షోభం తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో భారీ ఎత్తు న నిధులు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ ప్రభుత్వ అరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను ప్రారంభించారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలను నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. తన వైద్య విద్య, వృత్తి హైదరాబాద్లోనే ప్రారంభమైందని ఇలాంటి రాష్ట్రానికి తిరిగి మరిన్ని సేవలు అందించేందుకు సదా సిద్ధమని పేర్కొన్నారు.