బెంగళూరు, ఆగస్టు 19: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై నాన్బెయిలబుల్ వారంట్ జారీ అయింది. 2010 నాటి లైంగికదాడి కేసులో బెంగళూరులోని సెషన్స్ కోర్టు వారెంట్ ఇచ్చింది. గతంలో వారంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు నిత్యానంద ఆచూకీ గుర్తించలేకపోయారు. నిత్యా నంద దేశం నుంచి పారిపోయి కైలాస అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.