హైదరాబాద్ : దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం ప్రకటించింది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సెలవు ప్రకటించాలని వైద్య సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వైద్య సిబ్బంది విజ్ఞప్తి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బందికి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.