హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): డిస్కౌంట్తో పెండింగ్ చలాన్లు చెల్లించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో సైబ ర్ నేరగాళ్లు ఆవకాశంగా తీసుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసి వాహనదారులను తికమకపెడుతూ డబ్బులు దోచేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటిపై జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. echallans.tspolice.gov.in/ publicview అనే అసలైన వెబ్సైట్లా echallantspolice.in నకిలీ వెబ్సైట్ను తయారు చేసినట్టు పోలీసులు ఎక్స్లో ట్విట్ చేశారు. ఎవరైనా నకిలీ వెబ్సైట్ల ద్వారా మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ విభాగం పోలీసులకు హెల్ప్ లైన్ నంబర్ 1930 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.