హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : ఏపీ మద్యం పాలసీ కేసులో విచారణకు పిలిచిన ఈడీ అధికారులు తన ఫోన్లోని డాటాను పూర్తిగా కాపీ చేసుకొన్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం ఈడీ విచారణకు హాజరైన ఆయన.. ఏడున్నర గంటల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో సీజ్ చేసిన ఫోన్లలోని వివరాలను సేకరించారని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
తాను ఎవరి పేర్లూ చెప్పలేదని, మద్యం పాలసీ విషయాలన్నీ రాజ్ కేసీరెడ్డికి తెలుసని తాను చెప్పినట్టు తెలిపారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. స్కామ్పై విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. లావాదేవీలు, విజయసాయి అందించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.