జమ్మికుంట: దుబ్బాక నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీకి చైర్మన్గా ఉన్న బీఆర్ఎస్ నేత రాజేశ్వర రావుపై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొన్నగంటి మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది. జమ్మికుంట మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా ఇరువురికి 15 చొప్పున సమబలాలు ఉన్నాయి. వారిలో ఒక వర్గం కౌన్సిలర్లను కొత్తూరు శివారులోని ఫామ్ హౌజ్లో ఉంచినట్లు సమాచారం.
కొత్తూరు మండలం వైఎం తండా శివారులోని ఓ ఫామ్ హౌజ్లో ఒక వర్గానికి చెందిన కౌన్సిలర్లను దాచి ఉంచారని సమాచారం అందడంతో.. వారిని తీసుకెళ్లేందుకు మరో వర్గం నేతలు అక్కడికి వచ్చినట్లు తెలుస్తున్నది. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌజ్ వద్దకు చేరుకుని వాదులాటకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య బాహబాహీ చోటుచేసుకున్నట్లు సమాచారం.