కవాడిగూడ, మార్చి 7: గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రిబ్ వెలువరించిన అన్ని నోటిఫికేషన్లలోని పోస్టులను నుంచి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు భర్తీ చేసి, అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని కోరారు.
ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా 9,210 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని గురువారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద గురుకుల అభ్యర్థులు నిర్వహించిన ధర్నాలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ధర్నాలో ఓయూ జేఏసీ నేత ఎల్చల దత్తాత్రి, గురుకుల టీచర్స్ అభ్యర్థులు సైదులు, ఏ రాజు, జయశంకర్, సత్యనారాయణ, కాంతారావు, ఆస్మా తదితరులు పాల్గొన్నారు.