హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాశ్ ఊరట లభించింది. వైఎస్ హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ వేసిన పిటిషన్ విచారించిన కోర్టు.. ఈ నెల 25 వరకు అవినాశ్రెడ్డి అరెస్టు చేయొద్దని మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు ప్రతిరోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించింది. అవినాశ్ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ హైకోర్టు ఆదేశించింది. కాగా, ఇదే కేసులో నిందితులు భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిలను బుధవారం నుంచి ఆరు రోజులపాటు సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇందుకు కోర్టు అనుమతిచ్చింది. వీరిద్దరితోపాటు ఎంపీ అవినాశ్రెడ్డిని కూడా ప్రశ్నిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.