హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అకోల-సంగారెడ్డి నాలుగు లేన్ల జాతీయ రహదారి-161 అందుబాటులోకి వచ్చింది. రూ. 3,695 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డును గత శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.
రోడ్డు అందుబాటులోకి రావడంతో మహారాష్ట్ర-తెలంగాణ రాష్ర్టాల మధ్య రవాణా మరిం త సులభతరం కానుంది.