NIT Warangal | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: వరంగల్ నిట్ క్యాంపస్లో ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్స్లో నిట్ విద్యార్థికి ఓ కంపెనీ అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసిందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం నిట్లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో అక్షయ పేరిట సక్సెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో) దుర్గాప్రసాద్ అల్లాడ హాజరయ్యారు.
నిట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. 2022-23 విద్యాసంవత్సరంలో మొత్తం 1,400 మందికి ఉద్యోగాల ఆఫర్లు అందించినట్టు తెలిపారు. 270కి పైగా కంపెనీలు క్యాంపస్ను సందర్శించినట్టు చెప్పారు. ఎంపికైన ఉద్యోగాల్లో అనలిస్ట్ 122, ఎస్డీఈ 566, కోర్ 432, ఇతర వాటిలో 280 ఉన్నాయని పేర్కొన్నారు.