అంబర్పేట/సుబేదారి, సెప్టెంబర్ 5: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారు లు సోమవారం వరంగల్, హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై బాగ్అంబర్పేటలో ఉంటున్న చైతన్య మహిళా సం ఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఇంట్లో 5 గంటలపాటు సోదాలు నిర్వహించి.. పుస్తకాలు, డైరీలను స్వాధీనం చేసుకున్నారు.
హనుమకొండ ప్రకాశ్రెడ్డిపేట విద్యుత్తు కాలనీలో ఉంటున్న చైతన్య మహిళా సంఘం నాయకురాలు, ప్ర భుత్వ టీచర్ అనిత నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సాహిత్య పుస్తకాలు, సెల్ఫోన్ను సీజ్చేశారు. ఆ తర్వాత హంటర్ రోడ్డులోని సంతోష్నగర్లో అనీత తల్లి ఇంట్లోనూ తనిఖీలుచేశారు.
తన కుమార్తె రాధను నర్సింగ్ చదివిస్తామని చెప్పి తీసుకెళ్లారని 2017 డిసెంబర్లో ఏపీలోని విశాఖ పెదబయలు పీఎస్లో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సం ఘం నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన ఎన్ఐఏ గతంలోనే కొం దరి ఇండ్లలో సోదాలు నిర్వహించింది.