హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): యోగా పేరిట ముస్లిం యువకులను రెచ్చగొడుతూ ఉగ్రవాద శిక్షణ ఇప్పించడం, ఉగ్ర దాడులు చేసేలా ప్రోత్సహించటం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పీఎఫ్ఐ ప్లాన్ చేసిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హైదరాబాద్లోని స్పెషల్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. పీఎఫ్ఐ ఉగ్ర శిక్షణ ఇస్తున్నదన్న సమాచారంతో నిజామాబాద్ నాలుగో పోలీస్ స్టేషన్లో పోలీసులు ఈ ఏడాది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఆగస్టులో ఎన్ఐఏ తిరిగి కేసు రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేపట్టింది. ఉగ్ర శిక్షణకు బాధ్యులైన నిందితుల పై కేసు నమోదు చేసినట్టు ఎన్ఐఏ వెల్లడించింది.