హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్త డాక్టర్ శిబ్శంకర్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఐఎన్వైఏఎస్) సభ్యుడిగా శాస్త్రవేత్త శిబ్శంకర్ గంగూలీ ఎంపికయ్యారు.
చమురు వెలికితీత ద్వారా సురక్షితమైన కార్బన్ డయాక్సైడ్ జియో సీక్వెస్ట్రేషన్ కోసం భారతీయ చమురు క్షేత్రాన్ని సమీక్షించడంపై డాక్టర్ గంగూలీ కృషి చేశారు. మానవజనిత కార్బన్ డయాక్సైడ్ను తొలగించడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించవచ్చని ఆయన తన అధ్యయనంలో వెల్లడించారు. కాగా, ఐదేండ్ల పాటు ఐఎన్వైఏఎస్ సభ్యుడిగా గంగూలీ సేవలందిస్తారు. కేంద్ర