TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో.. ఆదివారం నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ నారాయణపేట, వపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. సోమవారం కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గడిచిన 24గంటల్లో రాష్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, రంగారెడ్డి, కొత్తగూడెం, జోగులాంబ గద్వాల జిల్లా సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 13.2, ములుగు జిల్లాల్లోని మేడారంలో 13.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.