హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న వికారాబాద్-కృష్ణ మధ్యలో కొత్తగా రైల్వేలైన్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. అం దుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం అవసరమైన డీపీఆర్లు కూడా రైల్వే బోర్డుకు చేరినట్టు తెలిసింది. దాదాపు 130.28 కిలోమీటర్ల దూరం గల నూతన రైల్వే లైన్ నిర్మాణానికి దాదాపు రూ. 2,750 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసినట్టు కేంద్రం ప్రకటించింది.
తెలంగాణ ప్రాంతంలోని ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఎవరికి ప్రయోజనం కాదని భావించిన రైల్వే బోర్డు, స్థానిక రాజకీయ నాయకులు ఒత్తిడితో ఈ మా ర్గంలో నూతన రైలు మార్గం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దక్షిణ తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమని ఆ ప్రాంత నాయకులు గత సర్కార్ హయాంలో రైల్వే జీఎం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది.