హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో నీటి వనరులు, తేమ ప్రాంతాల్లో సరికొత్త మొక జాతిని పరిశోధకులు గుర్తించారు. రాష్ట్రం పేరు మీదుగా ఈ మొకకు అమ్మానియా తెలంగాణెన్సిస్ అని నామకరణం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలతోపాటు నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న వట్వర్లపల్లి వద్ద ఈ మొకలను కనుగొన్నారు. ఈ కొత్త జాతి లిత్రేసి వృక్ష కుటుంబానికి చెందినది. అంతర్జాతీయ వర్గీకరణ శాస్త్ర పత్రిక ‘ఫైటోటాక్సా’ జర్నల్లో ఈ ఆవిషరణ వివరాలు ప్రచురితమయ్యాయి.
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా(బీఎస్ఐ) డెకన్ రీజినల్ సెంటర్కు చెందిన అరికృష్ణన్ పార్థిబన్, లదన్ రసింగం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుడు సిద్ధార్థన్ సర్వేశ్వరన్, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన సంధ్య దీపికా దేవర కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ మొకకు కాడలపై వికసించే పూల గుత్తులు(మెజెంతా రంగు రేకులు) ఉంటాయి. దీని విత్తనాల ఉపరితలం మానవ మస్తిషం(బ్రెయిన్) ఆకారాన్ని పోలి ఉండే విలక్షణమైన రూపాన్ని కలిగి ఉండటం విశేషం.