హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు నూతన ఎమ్మెల్సీలు ఈ నెల 31న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామ్రెడ్డి, నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.