హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్కు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త పీఆర్సీ అమలు నేపథ్యంలో స్లాబ్లను మార్చింది. గతంలో ఉన్న నాలుగు స్లాబ్లను కొనసాగిస్తూ, ఉద్యోగులు పొందుతున్న వేతనాలను బట్టి స్లాబ్ రేట్లలో మార్పులు చేశారు. ప్రతి యూనిట్ విలువ రూ.15ను, ఉద్యోగి మరణిస్తే యూనిట్కు రూ.15వేలు చొప్పున చెల్లించడాన్ని సైతం కొనసాగించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.