సుల్తాన్బజార్,ఆగస్టు 18: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (జేఎన్ఏఎఫ్ఏ) యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎనర్జీ అండ్ సైస్టెనబుల్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నామని వర్సిటీ వీసీ కవితా దర్యానీరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని వర్సిటీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ఈ కొత్త కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా రాష్ట్రంలో తొలిసారిగా ఈ కోర్సును తీసుకొచ్చామని చెప్పారు. పర్యావరణం, స్థిరమైన సవాళ్ళను పరిష్కరించడానికి అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలతో ఈ కోర్సులో చేరిన విద్యార్థులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ, బీటెక్, బి డిజైన్, బి ఆర్కిటెక్చర్తో పాటు పీజీ సెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు అని వివరించారు. కోర్సులో ప్రవేశాలకు www.jnaf au. ac.inను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సుందర్కుమార్, అకాడమీ కోఆర్డినేటర్ వినోద్ గణేశ్, మధుకర్, ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.