నిజామాబాద్ : వివాహ వేడుకలో భాగంగా నూతన వదూవరులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామంలో నూతన వధూవరులు అల్లూరి ప్రియాంక రెడ్డి, మధురెడ్డి మొక్కలు నాటారు. తమ పెండ్లి రోజున ఈ నవ దంపతులు మూడు మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వధూవరులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరు తమ వంతుగా మూడు మొక్కలు నాటాల్సిందిగా కోరారు.