హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): జాతీయ హెల్త్కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఎన్నికయ్యింది. శనివారం హైదరాబాద్లోని నోవాటెల్లో హెల్త్కేర్ ప్రొఫెషనల్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల నుంచి హెల్త్కేర్ వృత్తిదారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జాతీయ హెల్త్కేర్ కమిటీని ఎన్నుకున్నారు.
జాతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి, సెంట్రల్ కమిటీ కన్వీనర్గా కొత్త రాహుల్రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ ఆచార్యను ఎన్నుకున్నారు. కమిటీలో ఏపీ నుంచి డాక్టర్ నాగేంద్ర, కర్ణాటక నుంచి వీరేంద్ర, బాలరాజు, మహారాష్ట్ర నుంచి డాక్టర్ సుమిత్ర, ఢిల్లీ నుంచి ఎండీ సద్దాం, బీహార్ నుంచి ముక్తా భారతి, హైదరాబాద్ నుంచి రమేశ్, ప్రేమ్ ఎన్నికయ్యారు. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి అన్ని పార్టీలను కలుపుకొని పోతామని ఆ సంఘం బాధ్యులు తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వానికి, అన్ని పార్టీ నాయకులు వినతిపత్రాలు అందచేస్తామని చెప్పారు.