హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఈ యేడు నుంచి మూడేండ్ల బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుకు అదనంగా నాలుగేండ్ల బీబీఏ ఆనర్స్ కోర్సును ఓయూ ప్రవేశపెట్టింది. ఈ కోర్సుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి ఇచ్చింది.
దీని నిర్వహణకు ముందుకొచ్చిన రెండు ప్రైవేటు ఎంబీఏ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తూ ఓయూ నిర్ణయించింది.ప్రస్తుతం ఓయూ పరిధిలో ఈ కోర్సుకు 300 సీట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.