హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్కుమార్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఏపీ తొలి మహిళా ఎస్ఈసీగా ఆమె గుర్తింపు పొందారు. అనంతరం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా ఆమె గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై గవర్నర్తో చర్చించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్తో ఎస్ఈసీ సమావేశమై ఎన్నికలపై చర్చించారు.