హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టయింది. భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం మౌలాలీ పరిధిలో భారీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దొరికిన సుమారు రూ.17 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారుల బృందం సీజ్ చేసింది.
మౌలాలీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలోని ఒక కర్మాగారంలో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 69.6 కిలోల నిషిద్ధ డ్రగ్స్ పట్టుబడిందని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ను నిందితులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.