హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాలని విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్ల సంఘాల జాతీయ సమాఖ్య పిలుపునిచ్చింది. శుక్రవారం ఢిల్లీలో మోహన్ శర్మ అధ్యక్షతన జరిగిన నేషనల్ చాఫ్టర్ సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్ర విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై పలు తీర్మానాలు చేశారు. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటిరోజు దేశవ్యాప్త సమ్మె చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈనెల 8న రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, ప్రాజెక్టుస్థాయి నుంచి ప్రధాని, కేంద్ర విద్యుత్తుమంత్రి, సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు బిల్లు వల్ల కలిగే నష్టాలను తెలుపుతూ లేఖలు రాయాలని, 15న జంతర్మంతర్లో ధర్నా నిర్వహించాలని తీర్మానించింది. సమావేశంలో ఉద్యోగసంఘాల నేతలు శైలేంద్ర దూబే, పీ రత్నాకర్రావు, త్రివేది, అభిమన్యు, మోహన్శర్మ, రానా తదితరులు పాలొన్న్గారు.