హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): నేర దర్యాప్తులో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయిలో గు ర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2022’ పతకాలకు తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఐదుగురు ఎంపికయ్యారు.
ఎంపికైన వారిలో ట్రాన్స్కో డీఎస్పీగా పనిచేస్తున్న పీ వెంకటరమణ, ఆసిఫ్నగర్ ఏసీపీ రుద్రవరం గాండ్ల శివమారుతి, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డి, బాలానగర్ డీఎస్పీ ఏ గంగారామ్, జహీరాబాద్ ఏసీపీ వీ రఘు ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో కలిపి 151 మందిని కేంద్ర హోంశాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జాతీయ పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు.