ఏపీపై మండిపడిన ఎన్జీటీ
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని ఉల్లంఘిస్తే ఎలాఅని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏపీని ప్రశ్నించింది. సాక్షాత్తూ ప్రభుత్వమే పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించడం సిగ్గుచేటు అని మండిపడింది. పోలవరం, పురుషోత్తమపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ సోమవారం విచారించింది. పోలవరం కాఫర్డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను నిలదీసింది. కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసు ముగించాలన్న ఆతృతే సీపీసీబీ నివేదికలో కన్పిస్తున్నదని తప్పుపట్టింది.