చిక్కడపల్లి, జూన్4: దేశంలోని అన్ని బ్యాంకుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, దినసరి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీఈఎఫ్ఐ (బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ దేబాశిష్ బసు చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర రెండో మహాసభలో ఆయన మాట్లాడారు.
బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయకుండా వినియోగదారులకు ఎలా మెరుగైన సేవలందించగలమని ప్ర శ్నించారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సభలో ఆలిండియా రీజినల్ రూర ల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేట్ సెక్రటరీ జనరల్ ఎస్ వెంకటేశ్వరరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి పీ వెంకటరామయ్య పాల్గొన్నారు.