నల్లగొండ రూరల్, ఆగస్టు 17: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటోజర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫొటోగ్రఫీ కాంపిటేషన్-2023లో నమస్తేతెలంగాణ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు దక్కాయి. దేశ వ్యాప్తంగా 500 ఎంట్రీలు రాగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఆర్ ఆకాశ్ను, యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్ గుజ్జ నరేశ్ను అవార్డులు వరించాయి. నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా జరిగిన అగ్నిగుండాల్లో నిప్పులపై నడుస్తున్న శివసత్తి ఫొటోకుగానూ ఆకాశ్కు ఈ అవార్డు దక్కింది. యాదగిరిగుట్ట ఆల యం బంగారు వర్ణంలో ధగధగలాడుతున్న ఫొటోకు జనరల్ కేటగిరీలో నరేశ్కు కన్సోలేషన్ అవార్డు లభించింది. 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో అవార్డులు ఇవ్వనున్నారు. ఆకాశ్ గతంలోనూ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్గా అవార్డులు అందుకున్నారు.