హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ)/కామారెడ్డి/సుభాష్నగర్ : సంస్కృతాంధ్ర విద్వతవి, అష్టావధాని, తెలంగాణ ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ(68) మంగళవారం కన్నుమూశారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బా ధపడుతున్న శర్మ హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన స్వగృహంలో అంతిమ శ్వాసవిడిచారు. ఆయన తెలుగు, సంస్కృతంలో 60కి పైగా గ్రంథాలను రచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవిగా తన గొంతు విప్పారు. ఆయన సాహితీ సేవలను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం.. 2023లో దాశరథి అవార్డుతో స త్కరించింది. డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ 1956 జూలై 17న కామారెడ్డి జిల్లా రథాల రామారెడ్డిలో జయలక్ష్మీదేవి, ఆనందరాజశర్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నటేశ్వరశర్మ 1969లో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే సంస్కృతంలో, తెలుగులో పద్య, గేయ రచన లు చేయడం ప్రారంభించారు. 1970లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వ తి స్వామి తిరుమల శ్రీవేంకటేశ్వర వేద సం స్కృత పాఠశాలను సందర్శించిన సమయం లో విద్యార్థిగా ఉన్న శర్మ.. సంస్కృత శ్లోకాల తో స్వాగతం పలకడం విశేషం. తర్వాత శర్మ తన పాండిత్య ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నో పురసారాలను అందుకున్నారు.
కామారెడ్డిలోని ప్రాచ్య విద్యాపరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1977 నుంచి సంస్కృత విభాగాచార్యులుగా, అనంతరం ప్రధానాచార్యులుగా పనిచేసి 2014 జూలైలో పదవీ విరమణ చేశారు. 2011 నుంచి 2013 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రాచ్యభాషా విభాగానికి పీఠాధిపతి (డీన్)గా సేవలు అందించారు. ఆయన సాహిత్య వ్యాసాలు, కవితలు, విమర్శలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అంతర్యామి శీర్షికతో చేసిన రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామప్ప దేవాలయ శిల్పకళా వైభవాన్ని చాటిచెప్తూ ఆయన రచించిన సంస్కృత సంగీత రూపకం ‘నాగిని’ ఇటీవల హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైంది. విద్యార్థి దశలో రాసిన వచన కవితా సంపుటి ‘విక్రాంతిగీతి’ మహాకవి దాశరథి ప్రశంసలు అందుకున్నది. అవధాని శశాంక, శతావధాని సమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ అవధానాలతో స్ఫూర్తి పొందిన శర్మ.. డాక్టర్ రంగనాథ వాచస్పతితో కలిసి జంట అవధానాలు చేశారు. నటేశ్వరశర్మ తొలి గేయసంపుటి ‘వసంతకుమారి’(1981). ఖండకావ్యాలలో సమయవిలాసిని, పంచశరీయం, సౌదామినీ విలాసం, చుకలు, చైత్రరథం, ఆటవెలది, జీవనయానం విశిష్ట రచనలుగా పేరొందాయి. వ్యవహారిక భాషలో రాసిన ‘కవితాశతకం’.. మహాకవి శ్రీశ్రీ రచన ‘సిరిసిరిమువ్వ’ శతకాన్ని తలపిస్తుంది. ఆయన విశిష్ట సాహిత్య సేవలను గుర్తించిన ‘భక్తిసాధనమ్’ ఆధ్యాత్మిక సంస్థ గజారోహణ పురసారంతో సతరించింది.
రంజని-విశ్వనాథ పద్యకవితా పురసారం-2009, కిన్నెర ఆర్ట్ థియేటర్ వారి వచన కవితా పురసారం-2010, కిన్నెర-కుందుర్తి వచన కవితా పురసారం-2011, రాష్ర ్టకవి ఔగేటి ధార్మిక సాహితీ పురసా రం-2012, తెలుగు విశ్వవిద్యాలయం నుం చి అవధాన కీరి ్తపురసారం-2012, సర్వవైదిక సంస్థానం విశిష్ట కవి పురసారం-201 3, తెలంగాణ పద్య సాహిత్య పురసారం-2013, శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ పద్యకవి పురసారం-2014, తేజ ఆర్ట్ క్రియేషన్స్ నుంచి విశిష్ట కవి పురసా రం-2014, విశ్వసాహితి విశిష్ట సాహిత్య పురసారం-2014, భక్తి టీవీ ఆధ్యాత్మిక సే వా పురసారం-2014, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవధాన ప్రతిభా పురసా రం-2015, ఇందూరు అపురూప సాహితీ పురసారం-2016, వర్గల్ సరస్వతీ క్షేత్రం వారి ‘అవధాన భారతి’ పురసారం-2020, మల్లినాథసూరి కళాపీఠం వారి ‘మహోపాధ్యాయ’ పురసారం-2021, డీవీఎల్ఎన్ శాస్త్రి స్మారక సాహితీ పురసారం-2021, కోటంరాజు స్మారక సాహితీ పురసారం-2021 వంటి ఎన్నో పురసారాలను నటేశ్వరశర్మ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతిష్ఠాత్మక దాశరథి పురసారంతో సత్కరించింది. అయాచితం మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని పలువురు కవులు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించారు. బోయిన్పల్లిలోని శ్మశానవాటికలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
నటేశ్వరశర్మ రచించిన అభిజ్ఞాన శాకుంతలానికి పద్యానువాద ప్రబంధం ‘శకుంతల’కు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ కావ్య పురసారం లభించింది. దేశభక్తి కవితా సంపుటి ‘భారతీ ప్రశస్తి’కి జాతీయ సాహిత్య పరిషత్తు పురసారం లభించింది. రుతువుల సోయగాలను వర్ణిస్తూ రచించిన ‘రుతుగీత’కు ఉత్తమ కావ్య పురసారం వరించింది. తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని ప్రస్తుతిస్తూ సంస్కృతంలో రాసిన ‘తెలంగాణ సుప్రభాతం’.. ‘తెలంగాణ’ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై పాఠకులను ఆకట్టుకున్నది. రాష్ట్రావిర్భావం తర్వాత 33 జిల్లాల ప్రత్యేకతలను తెలుపుతూ రాసిన పద్యాలు ఈ నేల విశిష్టతను చాటాయి. సంస్కృతాంధ్ర భాషల్లో శర్మ నూటికిపైగా అష్టావధానాలు చేశారు. అవధాన ప్రతిభకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురసారం లభించింది. ఆదిశంకరాచార్యులు రచించిన ‘సౌందర్యలహరి’పై పరిశోధనలకుగాను 1994లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా, స్వర్ణపతకం అందుకున్నారు. ఆముక్తమాల్యదపై ఆయన విమర్శనా గ్రంథం ప్రామాణికమైనది.