హయత్నగర్ / హైదరాబాద్, మే12 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్(నార్మూల్), నేషనల్ డెయిరీ డెవలంప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మంగళవారం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా 15 ఏండ్లపాటు డెయిరీని అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్డీడీబీ తీసుకోనున్నది. ఒప్పందంలో భాగంగా పాడిరైతుల బకాయిలు చెల్లించేందుకు సంస్థ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డికి ఎన్డీడీబీ సంస్థ ప్రతినిధులు రూ.10 కోట్ల చెక్కును అందజేసినట్లు పేర్కొన్నారు. పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫిషరీస్ సెక్రటరీ ఇలాంబర్త్తి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఎన్డీడీబీ అధికారులు, నార్ముల్ మదర్ డెయిరీ మేనే జింగ్ డైరెక్టర్ కాటిపల్లి లింగారెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.