హైదరాబాద్ : డ్రగ్స్ కట్టడికి తరచూ సమావేశాలు జరుగుతున్నాయని, డ్రగ్స్ కట్టడికి ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు ఇచ్చారని వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ నిరోధానికి సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేశారన్నారు. దర్యాప్తులో లోపాలున్నాయని నార్కోటిక్ సూపర్వైజరీ వింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పబ్లు, బార్లు, రెస్టారెంట్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జోనల్ డీసీపీ పరిధిలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్, ర్యాపిడ్ బ్లూ హోటల్లో నడుపుతున్నారని, 24 గంటల పాటు పబ్ నిర్వహణకు అనుమతి తీసుకున్నారన్నారు.
పబ్లో డ్యాన్స్లు, డీజేలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తెల్లవారుజాము 4 వరకు మద్యం, ఆహారం విక్రయిస్తున్నారని, పబ్లో డ్రగ్స్కు సంబంధించి సమాచారం అందిందన్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో పబ్పై టాస్క్ఫోర్స్ బృందాల దాడి జరిగిందని, పబ్లో 38 మహిళలు సహా 148 మందిని గుర్తించినట్లు తెలిపారు. పబ్లో ఐదు ప్యాకెట్ల కొకైన్ లభించిందని, పబ్లో ఉన్న వారందరి వివరాలు తీసుకున్నామని డీసీపీ తెలిపారు. పుడింగ్ అండ్ మింక్ యజమాని అర్జున్, అభిషేక్పై కేసులు పెట్టినట్లు స్పష్టం చేశారు. డ్రగ్స్కు సంబంధించి జనరల్ మేనేజర్ అనిల్పైనా కేసులు పెట్టామని, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. పబ్లో గుర్తించిన 148 మందిపైనా నిఘా పెడతామని, పబ్లో ఉన్నవారందరు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు, వినియోగించినట్లు తేలలేదని స్పష్టం చేశారు.
డ్రగ్స్ కేసులో పబ్లో ఉన్న వారిని బాధ్యులను చేయలేదని, పబ్లో ఉన్నవారి పాత్ర ఉందని దర్యాప్తులో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. నిర్వాహకులు యాప్ ఏర్పాటు చేసుకొని పరిమిత సంఖ్యలో చేర్చుకుంటున్నారని, యజమానులకు తెలిసిన 50 మందితో గ్రూప్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. యాప్లో ఓటీపీ ద్వారా కోడ్ నమోదు చేసి ప్రవేశించేలా చూస్తున్నారని, వినియోగదారుడితో పాటు ఒకరిని అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. తక్కువ వినియోగదారులు ఉంటే అప్పటికప్పుడే చేర్చుకుంటున్నారని, గతంలోనూ పబ్లపై పలుమార్లు దాడులు జరిగాయని, పబ్ యాజమాన్యం కూడా మధ్యలో మారిందన్నారు. ఇవాళ రెడ్హ్యాండెడ్గా పబ్లో డ్రగ్స్తో పట్టుబడ్డారని డీసీపీ వివరించారు.