హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికార కేసులో డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ కే నందుకుమార్పై హైకోర్టు కొరడా ఝళిపించింది. హైదరాబాద్ ఫిలింనగర్లోని రోడ్ నంబర్ 1లో ఓ స్థలం లీజు విషయమై 2021లో జారీ చేసిన యథాతథస్థితి (స్టేటస్కో) ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనకు నెల రోజుల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. ఈ జరిమానాను 4 వారాల్లో చెల్లించాలని తీర్పు చెప్పింది.
జైలు శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును 4 వారాలపాటు నిలిపివేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఫిలింనగర్లోని రోడ్ నంబర్ 1లో డెకన్ కిచెన్ ఏర్పాటు చేసిన స్థలం లీజు విషయమై నందుకుమార్కు, సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత దగ్గుబాటి సురేశ్ మధ్య తలెత్తిన వివాదంపై అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.