హైదరాబాద్ : భారత స్వాతంత్ర్య ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కోర్టు విచారణ చేపట్టింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా కంగనా వ్యాఖ్యానించారని న్యాయవాది కొమిరెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. కంగనా వ్యాఖ్యలపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సైఫాబాద్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.