హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీ పని అయిపోయిందా? ఏకంగా పార్టీ అధిష్ఠానమే ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసిందా? తాజా పరిణామాలు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు రాష్ర్టానికి వరుసకట్టిన కేంద్ర మంత్రులు హడావుడి చేశా రు. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 25 మంది కేంద్ర మంత్రులు రాష్ట్రం లో పర్యటించారు. ఇందులో అమిత్షా, రాజ్నాథ్సింగ్, నిర్మలాసీతారామన్ వంటివారు ఉ న్నారు. వారిలో ఒకరిద్దరు మునుగోడులోనూ ప్రచారం చేశారు. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రావడమే మానేశారు. రాష్ట్ర నేతలే తప్ప మునుగోడులో కేంద్రం నుంచి వచ్చిన దూత లు కనిపించడం లేదు. దీంతో అధిష్ఠానం ‘కాడి వదిలేసిందని’ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ కనిపించకపోవడం, ఆహా ఓహో అంటూ రాష్ట్ర నేతలు చెప్పేదంతా ఉత్తిదే అని తేలడం, ఎంత ప్రయత్నించినా తమకు మూడో స్థానమే ఖాయమని నిర్ధారణ కావడంతో ఢిల్లీ పెద్దలు మునుగోడును వదిలేసినట్టు పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. ప్రచారానికి రాకపోయినా, కనీసం ఎన్నికల ఖర్చులకు కొన్ని నిధులు ఇవ్వమని రాష్ట్ర నేతలు కోరగా.. ‘ఓడిపోయే సీటుకు డబ్బు ఎందుకు దండగ?’ అని ముఖం మీదే చెప్పినట్టు తెలిసింది. ‘రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాం.. ఖర్చంతా తానే పెట్టుకుంటానని రాజగోపాల్రెడ్డి చెప్పారు కదా?’ అని ఎదురు ప్రశ్నించినట్టు సమాచా రం. దీంతో రాష్ట్ర నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, తీవ్ర నైరాశ్యంలో ము నిగిపోయారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
మునుగోడుకు సంబంధించి బీజేపీ నేతలు మొదటి రోజు నుంచీ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. తమ గోతిని తామే తీసుకున్నారు. ‘మునుగోడు అభివృద్ధి కోసం’ అంటూ రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారినట్టు స్వ యంగా ఆయనే చెప్పుకొన్నారు. అక్కడే తమ పరువు మొత్తం పోయిందని పెద్దలు తలలు పట్టుకున్నారట. దుబ్బాక, హుజూరాబాద్లో ఇచ్చిన మోసపూరిత హామీలనే మునుగోడులోనూ ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ప్రజల్లో మరింత చులకన అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో ఏమీ చేయలేదని బీజేపీ నేతలు చెప్పడం లబ్ధిదారుల్లో ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇక నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీని వణికించింది. ప్రజల్లో ఉన్న కాస్త సానుభూతిని సైతం తుడిచిపెట్టేసింది. మొత్తంగా మునుగోడులో బీజేపీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయ్యిందని రాష్ట్ర నేతలే చెప్పుకోవడం గమనార్హం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం మునుగోడుకు రావడానికి ఆసక్తి చూపలేదు. సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ, ‘ఓడిపోయే చోట సభ పెడితే ఇజ్జత్ పోతది’ అని వెనక్కి తగ్గినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నడ్డా రాకపోయినా సోమవారం నియోజకవర్గంలో 9 చోట్ల 9 బహిరంగ సభలు పెడతామని, 20 వేల మంది చొప్పున సమీకరిస్తామని బండి సంజయ్ బీరాలు పలికారు. దీనికి ఢిల్లీ నుంచి ఇద్దరుముగ్గురు పెద్దోళ్లు వస్తారని కూడా చెప్పారు. కానీ.. మునుగోడుకు వచ్చేందుకు కేంద్ర మంత్రులు గానీ, ఇతర రాష్ర్టాల నేతలుగానీ ఆసక్తి చూపలేదని తెలిసింది. పైగా ప్రజలను సమీకరించడం తమవల్ల కాదంటూ ఇతర నేతలు చేతులెత్తేశారట. దీంతో 9 సభలు సైతం ఢమాల్ అయ్యాయి.