యాదగిరిగుట్ట, జూలై 1: ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా యాదగిరిగుట్ట క్షేత్రం పునర్నిర్మాణం జరిగిందని నాబార్డు రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల, నాబార్డు మాజీ చైర్మన్ చింతల గోవిందరాజు కితాబునిచ్చారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి శనివారం వారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతరం ఆలయాన్ని తిలకించారు. నూతన ఆలయం ఎంతో అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. కృష్ణశిలల నిర్మాణాల తీరు అబ్బురపడేలా ఉన్నాయని ప్రశంసించారు. ఆలయం రాబోయే రోజుల్లో ఎంతో గొప్పగా వెలుగొందుతుందని ఆకాంక్షించారు.