Shyam Prasad Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి23 (నమస్తే తెలంగాణ): విశ్రాంత ఇంజినీర్ల సంఘం 2015లో ఇచ్చిన అధ్యయన నివేదిక అంశంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఇటీవల ఓ దినపత్రిక వార్తను ప్రచురిందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంప్రసాద్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ నివేదికకు సంబంధించి తాను చెప్పిన అభిప్రాయాలకు భిన్నంగా కథనం ప్రచురించిందని, సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను సైతం తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ఖండించినట్టు అందులో రాసిందని పేర్కొన్నారు. అది సరికాదని, ఆ పత్రిక కథనాన్ని ఖండిస్తున్నామని, భవిష్యత్తులో అలాంటి వార్తలు రాయకుండా ఉండాలని శ్యాంప్రసాద్రెడ్డి ఆ ప్రకటనలో కోరారు.