హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్సెస్ అండ్ హెల్త్టెక్ ఫోరం, తెలంగాణ రాష్ట్ర ఫ్లాగ్షిప్ సదస్సు బయోఏషియా-2023తో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ భాగస్వా మ్యం కుదుర్చుకున్నది. ఎంఎస్ఎంఈ రం గంలోని ఫార్మా కంపెనీలకు దీనివల్ల ప్రోత్సాహం లభించనున్నది. వచ్చే ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్లో వార్షిక బయోఏషియా సదస్సు జరుగనున్నది.
ఇందులో ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు, కంపెనీల నిర్వాహకులు, నిపుణులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, అనుబంధ పరిశ్రమలకు చెం దిన 60 ఎంఎస్ఎంఈ కంపెనీలతో ట్రేడ్ షో ఏర్పాటు చేయనున్నారు. బయోఏషియాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భాగమైనట్టు ఇందులో ఎంఎస్ఎంఈలు కూడా ఉన్నాయని పరిశ్రమల శాఖ ము ఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు.