హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో సీజే పదవి ఖాళీ కానున్నది. ఈ స్థానంలో తాతాలిక సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావును నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లీ ప్రమాణస్వీకారం చేశాక యాక్టింగ్ సీజేగా జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరిస్తారు. జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు 1966 ఆగస్టు 7న హైదరాబాద్లో పుట్టారు. సెయింట్ పాల్స్ హైసూల్లో చదివారు. 1989లో ఓయూ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తిచేసి.. గోల్డ్ మెడల్ అందుకున్నారు. యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 1991లో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేస్తూనే.. 2012 జూన్ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు హైకోర్టులో సీనియారిటీలో రెండోస్థానంలో ఉండటంతో ఆయనను తాత్కాలిక సీజేగా రాష్ట్రపతి నియమించారు.
రాజసం ఉట్టిపడే హైకోర్టు భవనం: సీజే జస్టిస్ హిమాకోహ్లీ
హైదరాబాద్ నగరంలో ఆధునికతే కాదు.. సంసృతి, సాంప్రదాయాలు మేళవించి ఉంటాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ కొనియాడారు. ఏడు మాసాల స్వల్పకాలమే పనిచేసినప్పటికీ.. ఇకడి ప్రజల ఆదరణ, ఆప్యాయతలు, అనుభూతులు మదినిండా ఉన్నాయని, వాటన్నింటిని ఢిల్లీకి మోసుకుపోతున్నట్టు తెలిపారు. రాజసం ఉట్టిపడేలా గంభీరమైన వందేండ్ల నాటి హైకోర్టు భవనంలో విధులు నిర్వహించడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన హిమాకోహ్లీకి శుక్రవారం హైకోర్టులో వీడోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు పూర్తిగా సహకరించారని తెలిపారు. హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి ప్రయత్నించినట్టు చెప్పారు. అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు మహ్మద్ ముంతాజ్బాష, కార్యదర్శి కల్యాణ్రావు తదితరులు జస్టిస్ హిమాకోహ్లీని సన్మానించారు. వీడ్కోలు సమావేశంలో న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విభు భక్రు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్రెడ్డి, సహాయ సొలిసిటర్ జనరల్ ఎస్ రాజేశ్వర్రావు, పీపీ ప్రతాప్రెడ్డి, జస్టిస్ హిమాకోహ్లీ సోదరి నీలు పాల్గొనగా.. మిగిలిన న్యాయమూర్తులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.