ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి
ముషీరాబాద్, ఆగస్టు 10: దేశానికే ఆదర్శంగా నిలిచేలా దళిత బం ధు పథకానికి శ్రీకారంచుట్టిన సీఎం కేసీఆర్ వెంటే తమ జాతి ప్రజలు నిలుస్తారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. దశాబ్దాలు గా దళితులను ముంచినవాళ్లే నేడు దళిత బంధును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి దళితులంతా ఏకమై తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్, ఉప కులాల ఆధ్వర్యంలో హుజూరాబాద్, హైదరాబాద్లో త్వరలో దళిత బంధు విజయోత్సవ సభలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ విద్యానగర్లో ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో వంగపల్లి మీడియాతో మాట్లాడుతూ.. దళితు లు ధనవంతులు కావాలంటే కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. దళిత బంధు కోసం రూ.500 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. సమావేశంలో నాయకులు ఎల్లేశ్, వెంకట్, శ్యామ్రావు, చందు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.