హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తాను జన్మించిన హైదరాబాద్లోని పేట్లబుర్జు ప్రభుత్వ దవాఖానకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షల నిధులు అందజేశారు. దవాఖానకు రూ.కోటి నిధులు అందజేస్తానని ఎంపీ సంతోష్కుమార్ గతంలో హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన రూ.50 లక్షలకు సంబంధించిన మంజూరు పత్రాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పీ మాలతికి అందజేశారు. తన జీవితంలో పేట్లబుర్జు దవాఖానకు ప్రత్యేక స్థానమని, మిగతా రూ.50 లక్షలను వచ్చే ఆర్థిక సంవత్సరం నిధుల నుంచి విడుదల చేస్తానని ఎంపీ తెలిపారు. మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పేట్లబుర్జు దవాఖాన అభివృద్ధి పట్ల ఎంపీ సంతోష్కుమార్ చూపుతున్న ఆసక్తి మిగతా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు.