హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని వడియారం రైల్వే స్టేషన్లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్, మెదక్, రామయంపేట, తూప్రాన్ ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న వడియారంలో నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.