పానిండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 800కోట్ల భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. ఈ సినిమాలో తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ నటిస్తున్నారట. నిజానికి ఇద్దరు కొడుకుల పాత్రలకు మాత్రమే బన్నీని అనుకున్నారట అట్లీ. తాత, తండ్రి పాత్రలను వేరే నటులతో చేయించాలని ఆయన భావించారట. కానీ ఆ పాత్రల తీరుతెన్నులు నచ్చడంతో తానే చేస్తానని బన్నీ పట్టుబట్టారట. బన్నీ కోరిక మేరకు లుక్ టెస్ట్ నిర్వహించి, సంతృప్తికరంగా అనిపించడంతో అట్లీ ఓకే చేశారట. బన్నీ ఈ సినిమాలో నాలుగు పాత్రలు పోషించడం సినిమాకు కూడా ప్లస్ అవుతుందనేది చిత్రబృందం అభిప్రాయం కూడా. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నది. 2027 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. దీపిక పదుకొన్ ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.