బెజ్జంకి, డిసెంబర్ 27 : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కనపడుట లేదని టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్వర్యంలో సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్స్టేషన్లో ఎస్ఐ ఆవుల తిరుపతికి ఫిర్యాదు చేశారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, కనీసం అభివృద్ధి పనులకు, సర్వసభ్య సమావేశాలకు హాజరు కాలేదని, మండల సమస్యలు ఎరుగని బండి సంజయ్ను కనిపెట్టాలని కోరారు.
ఫిర్యాదు చేసిన వారిలో యూత్విభాగం అధ్యక్షుడు బిగుల్ల మోహన్, బోనగిరి శ్రీనివాస్, యలాల పరుశరాములు, కొరివి తిరుపతి, శాతవేణి మహేశ్, శివ తదితరులు ఉన్నారు.