గుండాల, నవంబర్ 25 : సీఎం కేసీఆర్ యాదవుల ఆత్మ బంధువు అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కొనియాడారు.తెలంగాణలో 7.50 లక్షల యాదవ కుటుంబాలకు గొర్రెల యూనిట్లను అందజేశారని, దాంతో దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని చెప్పారు.
రేవంత్రెడ్డి ఓ దొంగ అని, ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా దొరికి చిప్పకూడు తిన్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక రేవంత్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేసిందని అన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి ఓ మూర్ఖుడని, రైతుబంధు వద్దంటున్నాడని మండిపడ్డారు. యాదవులు కష్టజీవులని, యాదవులను గతంలో ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ యాదవులకు తగిన ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.