ములకలపల్లి, అక్టోబర్ 19 : క్షణికావేశంలో ఓ తల్లి తన రెండేండ్ల కూతురుకు పురుగుమందు తాగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట కాలనీలో బుధవారం చోటుచేసుకొన్నది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యల అనూష(25) పుట్టింటికి వెళ్తానని భర్త మల్లయ్యను కోరగా, తాను జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నానని, ఈ సమయంలో ఎలా వెళ్తావని అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుమందును తన రెండేండ్ల కుమార్తె నక్షత్రకు తాగించి, ఆ తర్వాత తాను కూడా తాగింది. వెంటనే మల్లయ్య.. భార్య, కూతురిని ఆటోలో ములకలపల్లి పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాల్వంచ ప్రభుత్వ ఏరియా దవాఖాన తీసుకెళ్తుండగా తల్లీకూతురు మృతిచెందారు.