భద్రాచలం : భద్రాచలం గోదావరి వంతెన ( Godavari Bridge ) పై శనివారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఓ మహిళ తన చిన్నారితో సహా వంతెనపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt ) పాల్పడింది.
స్థానికుల కథనం ప్రకారం పాల్వంచకు చెందిన సదరు మహిళ శనివారం మధ్యాహ్నం తన బిడ్డతో కలిసి భద్రాచలం గోదావరి వంతెన వద్దకు చేరుకుని చిన్నారితో సహ నదిలోకి దూకింది. గమనించిన ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు వారిని వెంటనే కాపాడారు.
క్షేమంగా తల్లీబిడ్డను బయటకు తీసుకువచ్చి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.