హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్దుంభవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజురోజుకూ బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని, కర్ణాటక ఎన్నికల్లో కూడా సీట్లు తగ్గుతాయని చెప్పారు. ప్రధాని మోదీ అవినీతి, అదానీ, అంబానీలతో ఉన్న అనుబంధం, క్విడ్ ప్రోకో అంశాలపై 2024లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ విచారణలో బహిర్గతమవుతాయని, అప్పుడు మోదీ జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు.
మోదీకి చిత్తశుద్ధి ఉంటే బ్యాంకులకు ఎగ్గొట్టిన వారి ఆస్తులను జప్తు చేయాలని, నల్లధనంపై శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ సంస్థను వ్యతిరేకిస్తూనే పేపర్ లీకేజీ కేసును అదే సంస్థకు అప్పగించాలని కాంగ్రెస్ కోరడం సరైంది కాదని తెలిపారు. బీజేపీని గద్దెదించేందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతుందని, ఈ నెల 14న చేపట్టబోయే ఇంటింటికీ సీపీఐ ప్రారంభ సభను హైదరాబాద్ ఇందిరాపార్ వద్ద నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మే 14న కొత్తగూడెంలో లక్ష మందితో ముగింపు సభను నిర్వహస్తామని తెలిపారు. అంతకు ముందు ఇంటింటికీ సీపీఐ పోస్టర్ను ఆయన ఆవిషరించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, కలవేని శంకర్, బాగం హేమంతరావు, బాలనర్సింహ పాల్గొన్నారు.