హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఏకంగా 1,054 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఒమిక్రాన్ వేరియంటే కావడం ఊరటనిచ్చే అంశం.
పాజిటివిటీ రేటు 2.38 శాతంగా ఉన్నది. అత్యధికంగా హైదరాబాద్లో 396 మందికి పాజిటివ్గా తేలింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 60 చొప్పున, నల్లగొండలో 49, కరీంనగర్లో 46, రాజన్న సిరిసిల్లలో 36, పెద్దపల్లి, ఖమ్మంలో 35 చొప్పున, మంచిర్యాలలో 31, సిద్దిపేటలో 30 కేసులు వెలుగు చూశాయి. 795 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కేసులు పెరుగడంతో రికవరీ రేటు 98.77 శాతానికి తగ్గింది.